Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాని గుండెల్లో ధైర్యం నింపిన సూపర్‌స్టార్ రజనీకాంత్

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (13:53 IST)
రజినీకాంత్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు సృష్టించి అభిమానుల గుండెల్లో స్థానాన్ని చోటుచేసుకున్నారు. అయితే తాజాగా కరోనా కారణంగా తన వీరాభిమాని మురళి ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అతని ఆరోగ్యం విషమంగా మారింది.
 
ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ గురించి ఇలా రాసుకొచ్చాడు మురళి. 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి అత్యుత్తమ నాయకుడుగాను, ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక గురువుగా రాజ్య మార్గాన్ని ఏర్పరచి గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి వ్యక్తికి రూ.25 వేలు ఆదాయం వచ్చే పరిస్థితిని తీసుకొని రావాలని విన్నవించాడు. నీ సారథ్యంలో నడిచే సేవలు నేను అందించలేకపోతున్నానని బాధపడుతున్నానని పేర్కొన్నాడు.
 
అయితే ఇలాంటి పరిస్థితుల్లో తన అభిమాని ఉన్నాడని తెలుసుకున్న రజనీకాంత్ తన అభిమానికి ధైర్యాన్ని ఇచ్చే సందేశాన్ని పంపాడు. నీకేం కాదు, ధైర్యంగా ఉండు. అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటావు. తరువాత కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను అని వాయిస్ నోట్ పంపించారు.
 
ఇక లాక్ డౌన్ సమయం కావడంతో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు రజినీ. త్వరలోనే ప్రారంభించనున్న రాజకీయ పార్టీ గురించి చర్చలు జరుపుతున్నారు. నవంబర్ లోపు రజనీకాంత్ తన పార్టీని ప్రారంభిచనున్నారని తెలుస్తోంది. అటు సినిమా చర్చల్లో కూడా రజనీకాంత్ బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments