Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేస్-30 చిత్ర బృందానికి సుధీర్ బాబు అభినందనలు

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (23:23 IST)
యువ ప్రతిభాశాలి సందీప్ పైడిమర్రి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న వినూత్న కథాచిత్రం 'కేస్-30'. మర్డర్ మిస్టరీ నేపద్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో.. సిద్ధార్ద్ నాయుడు, శ్వేతా గర్గ్, తేజస్విని రావెళ్ల, 'రంగస్థలం' మహేష్ ముఖ్య తారాగణం. పి.ఎన్. ఆర్.ఫిల్మ్ ఫ్యాక్టరీ-యువసాయి క్రియేషన్స్ బ్యానర్స్ పై... పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇటీవల ఈ చిత్రం టీమ్ ప్రముఖ యువ కథానాయకుడు సుధీర్ బాబును కలిసి ఆయన అభినందనలు అందుకుంది. మంచి కాన్సెప్ట్-మంచి టీమ్ తో తెరకెక్కుతున్న 'కేస్-30' కచ్చితంగా మంచి విజయం సాధించాలని సుధీర్ బాబు ఆకాక్షించారు. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని, లాక్ డౌన్ కారణంగా ఆగిన ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే.. ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్లీ మొదలు కానుంది.
 
తమను తాము ప్రూవ్ చేసుకోవాలన్న తపన కలిగిన టీమ్‌తో రూపొందుతున్న 'కేస్-30' అందరికీ చాలా మంచి పేరు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన డెబ్యూ డైరెక్టర్ సందీప్ పైడిమర్రి.. నిర్మాతలు పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి కథ: సిద్ధార్ద్ నాయుడు, సినిమాటోగ్రఫీ: గౌతమ్ బండ్రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, మాటలు: భరత్ పచ్చా, పాటలు: శశికుమార్ సాకే, సంగీతం: జెరోమ్ ఎస్.వి, నిర్మాతలు: పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సందీప్ పైడిమర్రి!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments