'మీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది.. మరచిపోను'... 'మహానటి'ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రీరెడ్డి. హైదరాబాద్‌లో రక్షణ లేదని పేర్కొంటు తన మకాంను ఇపుడు చెన్నైకు మార్చింది. అక్కడ కూడా ఆమె తన ఇంటికి పరిమితం కావడం లేదు. కోలీవుడ్ అగ్ర

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (10:36 IST)
క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రీరెడ్డి. హైదరాబాద్‌లో రక్షణ లేదని పేర్కొంటు తన మకాంను ఇపుడు చెన్నైకు మార్చింది. అక్కడ కూడా ఆమె తన ఇంటికి పరిమితం కావడం లేదు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో పాటు నటుడు రాఘవ లారెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది.
 
అదేసమయంలో తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "రెడ్డి డైరీ" చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నటుడు విశాల్‌ తాను నటించిన "సండైకోళి–2" (పందెంకోడి-2) చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి శ్రీరెడ్డికి అవకాశం వచ్చింది. అంతేకాదు ఇకపై ఆమెతో నటించేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమె తన రక్షణ కోసం కెమెరా దగ్గరే ఉంచుకుంటారని ఈ చిత్ర హీరో విశాల్ వ్యాఖ్యానించారు. 
 
ఆ మాటలకు నటి కీర్తి సురేష్ నవ్వు ఆపుకోలేక.. ఫక్కున నవ్వేశారు. ఈ నవ్వు శ్రీరెడ్డికి ఎక్కడలేని ఆగ్రహం తెప్పించింది. విశాల్‌కు థ్యాంక్స్‌ చెబుతూ నటి శ్రీరెడ్డి ఇటీవల ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేసింది. అందులో నటి కీర్తీసురేశ్‌ నవ్వడం గురించి పేర్కొంటూ "మీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది. ఏం చింతించకండి మేడమ్‌ మీరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండలేరు. పోరాడేవారి బాధేంటో మీకూ ఒక రోజు తెలుస్తుంది. గుర్తుంచుకోండి. నేనూ మీ నవ్వును మరచిపోను. మీరిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నట్టున్నారు" అని పేర్కొంది. శ్రీరెడ్డి ట్వీట్‌పై కోలీవుడ్‌లో  చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments