Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంపీ కవిత సినిమాల గురించే మాట్లాడతారే కానీ?: శ్రీరెడ్డి

టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు జంప్ అయ్యానని... అక్కడే మకాం మార్చేస్తానని చెప్పుకొచ్చిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ బాంబు పేల్చింది. ఎంపీ కవిత కూడా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సినిమాల గురించే మాట్లాడతా

Advertiesment
Sri reddy
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:28 IST)
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు జంప్ అయ్యానని... అక్కడే మకాం మార్చేస్తానని చెప్పుకొచ్చిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ బాంబు పేల్చింది. ఎంపీ కవిత కూడా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సినిమాల గురించే మాట్లాడతారు కానీ మహిళల అంశాలను పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోందని శ్రీరెడ్డి కామెంట్లు చేసింది. 


సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కంటే.. ఆర్థిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని.. ఇది మహిళలను అవమానించినట్టే అవుతుందని మీడియా సమావేశంలో వెల్లడించింది. 
 
ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో జరిగిన గొడవల గురించి ప్రస్తావిస్తూ.. ఆర్ధిక లావాదేవీలపై శివాజీరాజా, నరేష్ మధ్య వివాదం చెలరేగడం, తరువాత రెండు రోజులకే సమస్య పరిష్కారమైందని చెప్పడం చూస్తుంటే ఆర్ధిక అంశాలే కీలకమైనవనే అభిప్రాయం కలుగుతుందని శ్రీరెడ్డి చెప్పింది. శ్రీరెడ్డితో జరిగిన ఇదే ప్రెస్‌మీట్లో పాల్గొన్న మరోనటి అపూర్వ.. నిరసన చేపట్టిన కళాకారులకు అవకాశాలు ఇవ్వకపోవడం బాధగా ఉందని తెలిపింది. 
 
మరోవైపు టాలీవుడ్‌లో లైంగిక దోపిడీ నివారణకు కమిటీ వేయాలని సినీ నటి శ్రీరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసింది. సినిమాటోగ్రఫీ, మహిళాభివృద్ది, మహిళా కమిషన్, కార్మిక శాఖ, తెలంగాణ డీజీపీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

లైంగిక దోపిడీ అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అయినా మహిళా కమిషన్ ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయ సేవాధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలని కోర్టు సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రా గడ్డపై అడుగుపెట్టను : రాహుల్ భీషణ ప్రతిజ్ఞ