Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ధరిత్రి చిన్నబోయింది.. గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

Webdunia
గురువారం, 28 మే 2020 (11:24 IST)
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావు 97వ జయంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కారణంగా సాదాసీదాగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు నివాళులు అర్పించారు. మనువళ్ళు అయిన టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మాత్రం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లలేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వారు అక్కడకు వెళితే అభిమానులు వస్తారని, తద్వారా సామాజిక భౌతికదూరం మాయమై, కరోనా వ్యాప్తికి కారణమవుతామని భావించారు. అందుకే తమతమ ఇళ్లలోనే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు తమ తాత సేవలను స్మరించుకున్నారు. గుర్తుకు తెచ్చుకున్నారు. 
 
ముఖ్యంగా, సీనియర్ ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తాతకు నివాళులర్పించిన ఎన్టీయార్ ట్విటర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఎన్టీయార్ ఫొటోను పోస్ట్ చేశాడు. 'మీరు లేని లోటు తీరనిది' అని ట్వీట్ చేశాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments