Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ధరిత్రి చిన్నబోయింది.. గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

NTR
Webdunia
గురువారం, 28 మే 2020 (11:24 IST)
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావు 97వ జయంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కారణంగా సాదాసీదాగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు నివాళులు అర్పించారు. మనువళ్ళు అయిన టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మాత్రం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లలేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వారు అక్కడకు వెళితే అభిమానులు వస్తారని, తద్వారా సామాజిక భౌతికదూరం మాయమై, కరోనా వ్యాప్తికి కారణమవుతామని భావించారు. అందుకే తమతమ ఇళ్లలోనే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు తమ తాత సేవలను స్మరించుకున్నారు. గుర్తుకు తెచ్చుకున్నారు. 
 
ముఖ్యంగా, సీనియర్ ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తాతకు నివాళులర్పించిన ఎన్టీయార్ ట్విటర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఎన్టీయార్ ఫొటోను పోస్ట్ చేశాడు. 'మీరు లేని లోటు తీరనిది' అని ట్వీట్ చేశాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

సామాజిక సేవ చేసే మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారు: సీఎం చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments