తెలుగు ధరిత్రి చిన్నబోయింది.. గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

Webdunia
గురువారం, 28 మే 2020 (11:24 IST)
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావు 97వ జయంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కారణంగా సాదాసీదాగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు నివాళులు అర్పించారు. మనువళ్ళు అయిన టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మాత్రం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లలేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వారు అక్కడకు వెళితే అభిమానులు వస్తారని, తద్వారా సామాజిక భౌతికదూరం మాయమై, కరోనా వ్యాప్తికి కారణమవుతామని భావించారు. అందుకే తమతమ ఇళ్లలోనే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు తమ తాత సేవలను స్మరించుకున్నారు. గుర్తుకు తెచ్చుకున్నారు. 
 
ముఖ్యంగా, సీనియర్ ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తాతకు నివాళులర్పించిన ఎన్టీయార్ ట్విటర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఎన్టీయార్ ఫొటోను పోస్ట్ చేశాడు. 'మీరు లేని లోటు తీరనిది' అని ట్వీట్ చేశాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments