Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఓ వీధికి గానగంధర్వుడి పేరు : సీఎం స్టాలిన్ ఆదేశాలు

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (13:13 IST)
గానగంధర్వుడు దివంగత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోనుంచి చెన్నై మహానగరంలోని ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో వర్థంతి వేడుకలు సెప్టెంబరు 25తేదీ బుధవారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఎస్పీబీ జీవించివున్న సమయంలో స్థానిక నుంగంబాక్కంలోని కామ్‌ధర్ నగర్‌లో ఉండేవారు. 
 
తన తండ్రి స్మారకార్థం ఎస్బీబీ ఇల్లు ఉన్న వీధి పేరుకు ఎస్పీబీ నగర్ లేదా ఎస్పీబీ వీధిగా నామకరణం చేయాలంటూ ఆయన తనయుడు ఎస్పీబీ చరణ్ ఇటీవల సీఎం కార్యాలయానికి ఓ వినతిపత్రం సమర్పించారు. దీన్ని పరిశీలించిన సీఎం స్టాలిన్ గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. 
 
కాగా, ఎస్పీబీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠా తదితర భాషల్లో వేలాది పాటలు పాడిన విషయం తెల్సిందే. గత 2020లో ఆయన కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కాగా ఎస్పీబీకి కేంద్రం 2001లో0 పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2021లో మరణాంతరం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కంగనా కారుకూతలతో మాకు సంబంధం లేదు : బీజేపీ - యూ టర్న్ తీసుకున్న బాలీవుడ్ నటి

జనసేన పార్టీలో చేరనున్న వైకాపా ఎమ్మెల్సీ బొత్స సోదరుడు

కచ్చితంగా చెప్తాను.. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్.. ఎవరు?

సింహాచలం వరాహ స్వామిని దర్శించుకున్న నారా లోకేష్

ప్రాణాలు తీసుకున్న బెంగుళూరు యువతి హత్య కేసు నిందితుడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments