Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి అయి ఇద్దరు పిల్లలున్న తండ్రితో సహజీవనం చేస్తున్న గాయని!!

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (14:52 IST)
మాలీవుడ్‌లో ప్రముఖ గాయని అభయ హిరణ్మయి. ఈమె గత తొమ్మిదేళ్లుగా ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్‍తో సహజీవనం చేస్తోంది. పైగా, ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్యతో ఏర్పడిన మనస్పర్థలు కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ప్రస్తుతం గోపి సుందర్ విడాకుల కేసు కోర్టులో ఉంది. 
 
మరోవైపు, ఆయన గాయని అభయ హిరణ్మయితో సహజీవనం చేస్తున్నారు. దీనిపై గాయని అభయ స్పందిస్తూ, తొమ్మిదేళ్లుగా మేమిద్దరం సహజీవనం చేస్తున్నా. పైగా, ఆయన వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేనా.. మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం 12 యేళ్లు. ఇలా చాలా విషయాల్లో మా మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. 
 
పైగా, ఆయన భారీ కాయుడు. ఆయన ముందు నేను చాలా చిన్నగా కనిపిస్తాను. గత 2008 నుంచి రిలేషన్‌లో ఉన్నా తమ మధ్య ఇప్పటివరకు చిన్నపాటి మనస్పర్థలు కూడా రాలేదు. మేమిద్దరం కలిసి సంతోషంగా జీవిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
మరోవైపు, గోపి సుందర్ స్పందిస్తూ, 'విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది.. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను' అని చెప్పుకొచ్చారు. 2001లో గోపిసుంద‌ర్.. ప్రియ అనే మహిళను వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments