Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తల్లిదండ్రులు నన్ను దోపిడీ చేయలేదు.. చదివించారు.. శ్వేతాబసు ప్రసాద్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (17:14 IST)
శ్వేతాబసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమా ద్వారా తెరపైకి వచ్చింది. ఆపై అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం వెల్లదీసింది. ముఖ్యంగా ప్రధానంగా హిందీ సినిమాలు, టెలివిజన్‌లో నటించింది. ఆమె మక్డీలో తన పాత్రకు ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 
 
ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్-3లో కనిపిస్తుంది. ఇందులో ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేఖ పాత్రను పోషిస్తోంది. పంకజ్ త్రిపాఠి యొక్క రోల్ మాధవ్ మిశ్రాతో పోటీ పడింది. మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, నటి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 
 
''ఇక్బాల్ తర్వాత మా పేరెంట్స్ చాలా సినిమాలకు నో చెప్పారు. రాజ్‌కుమార్ సంతోషి హల్లా బోల్, మధుర్ భండార్కర్ ట్రాఫిక్ సిగ్నల్‌లకు వారు నో చెప్పారు ఎందుకంటే వారు నన్ను చదువుకోవాలని కోరుకున్నారు. నేను డాక్యుమెంటరీలు తీశాను, మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత నా 23 ఏళ్ల వయసులో ఓ షార్ట్‌ మూవీలో అనురాగ్‌ కశ్యప్‌కి సహాయం చేశాను. నా తల్లిదండ్రులకు నేను చాలా కృతజ్ఞురాలిని, వారు నా కోసం ఎంతో శ్రమ పడ్డారు. డబ్బు సంపాదిస్తున్నానని నన్ను వారు దోపిడీ చేయలేదు. నా తల్లిదండ్రులు ఉద్యోగం చేయవద్దని కూడా చెప్పారు. బాగా చదివించారు. నా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేలా చూసుకున్నారు... అంటూ శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments