Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమార్తెపై ఆకాశమంత ప్రేమ .. పాదాలకు పాలాభిషేకం

parents paada pooja
, బుధవారం, 24 ఆగస్టు 2022 (17:51 IST)
ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలపై అమితమైన ప్రేమను చూపిస్తుంటారు. అయితే, ఈ తల్లిదండ్రులు మాత్రం ఒక్క మెట్టు ఎక్కువే. తమ కుమార్తెపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదనీ, ఆకాశమంత అని నిరూపించేలా, కుమార్తె పాదాలను పాలతో కడిగారు. పుట్టుకతోనే తమకు అన్ని విధాలుగా కలిసివచ్చిందని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను కుర్చీలో కూర్చోబెట్టి ఈ పాలభిషేకం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమ కుమార్తెపై తమకున్న ప్రేమను వినూత్నంగా చూపించాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను కుర్చీలో కూర్చోబెట్టి పెద్ద స్టీల్ పాత్రలో ఆమె పాదాలు పెట్టారు. ఆమె పాదాలను తల్లిదండ్రులిద్దరూ పాలతో కడిగారు. ఒకరి తర్వాత ఒకరు ఒక తెలుగు రంగు టవన్‍‌తో తుడిచారు. ఆ తర్వాత పాదాలకు కుంకుమ పెట్టారు. ఆ తర్వాత ఆ పాలను కూడా తాగారు. 
 
అంతేకాకుండా, ఒక పాత్రలో కుంకుమ నీళ్లు పెట్టి, ఆమె పాదాలను ఆ నీళ్ళలో ముంచి తెలుగు రంగు టవల్‌పైన పెట్టేలా చూశారు. ఆ తెలుగు రంగు టవల్‌పై పడిన ఆమె పాద ముద్రలను తీసుకున్నారు. అలా తమ కుమార్తె పట్ల ఉన్న ప్రేమను వారు చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్  అయింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందే తెలియదు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఆరోపణలు చేయొద్దు : కోర్టు ఆదేశం