''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్.. ఏప్రిల్ 15వరకు నో రిలీజ్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (18:18 IST)
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమా మార్చి 29న విడుదల కావాల్సి వుండగా, హైకోర్టు షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ఆదేశించింది. 
 
ఈ చిత్రాన్ని 15వ తేదీ వరకు సినిమా థియేటర్లతో పాటు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించడం కనిపించడంతో.. ఈ చిత్రం విడుదలైతే ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ... పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమాను ప్రదర్శించకూడదంటూ తీర్పును వెలువరించింది. ఒకవేళ ఎన్నికలయ్యాకైనా ఈ సినిమాను విడుదల చేయాలని వర్మ హైకోర్టును కోరుతారో లేకుంటే ఎన్నికల ఫలితాల వరకు ఈ చిత్రాన్ని ఆపేసేందుకు టీడీపీ నేతలు పట్టబుడుతారో తెలియాలంటే.. వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments