Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో శర్వానంద్ - రష్మిక మందన్నా (Video)

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (16:06 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నాలు ఆదివారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు.. మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వీరంతా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
 
కాగా, శర్వానంద్ - రష్మిక మందన్నా జంటగా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల దర్శకత్వం వహిస్తుంటే సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మూవీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. 
 
అయితే లాంచింగ్‌కు ముందు ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామి వారిని ద‌ర్శించుకోగా, అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలు చిత్ర యూనిట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments