Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య బాబూ.. ఏంటి బాబు ఇది... నర్తనశాల రిలీజ్ అవసరమా?

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (15:28 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ 'నర్తనశాల' చిత్రం కోసం చిత్రీకరించిన 16 నిమిషాల ఫుటేజ్‌ని రిలీజ్ చేశారు. నర్తనశాల సినిమాలోని 16 నిమిషాల ఫుటేజ్ రిలీజ్ చేస్తానని ప్రకటించగానే... ఎలా ఉంటుందో..? ఎలా డైరెక్ట్ చేసారో..? చూడాలి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడింది. 
 
అయితే... నర్తనశాల శ్రేయాస్ ఏటీటీలో రిలీజ్ చేసారు. తీరా చూసాకా... సామాన్య ప్రేక్షకులే కాకుండా బాలయ్య అభిమానులు సైతం విమర్శిస్తుండడం విశేషం. అవును... బాలయ్య అభిమానులకు కూడా అసలు నచ్చలేదట. అంత ఘోరంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
 
ఇందులో ఉన్న కథ విషయానికి వస్తే... ఆసక్తిగా చూసినవాళ్లకి నర్తనశాల చిత్రంలోని 16 నిమిషాల ఎపిసోడ్ నిరాశనే మిగిల్చింది. అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు.. ఎవ్వరికంట పడకుండా తామూ ధరించబోయే వేషాల గురించి అరిగిపోయిన పాత డైలాగ్స్ చెబుతుండటం చూస్తుంటే.. ఏంటి ఇది అనిపిస్తుంది. 
 
ఏదోలా మొత్తానికి ఓ సుదీర్ఘ సన్నివేశాన్ని లాక్కోస్తారు. అజ్ఞాతవాసానికి సన్నద్ధం అవ్వడానికే ఈ ఫిల్మ్‌లో సగం ఫుటేజ్ సరిపోయింది. పోనీ ఈ సుదీర్ఘ సన్నివేశంలో ఏమైనా ఆసక్తి ఉందా..? అంటే.. అదీ లేదు.
 
ఈ 16 నిమిషాల ఫుటేజ్ చూసిన వాళ్లు... బాలయ్య బాబు.. ఏంటి బాబు ఇది. నర్తనశాలను ఇప్పుడు రిలీజ్ చేయడం అవసరమా..? అంటూ అభిమానులే విమర్శిస్తుండడం విశేషం. మరి... ఈ విమర్శల పై బాలయ్య స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments