Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24న బాలయ్య నర్తనశాల రిలీజ్ : టిక్కెట్ ధర ఎంతంటే.....?

24న బాలయ్య నర్తనశాల రిలీజ్ : టిక్కెట్ ధర ఎంతంటే.....?
, బుధవారం, 21 అక్టోబరు 2020 (09:45 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన మరుపురాని చిత్రం నర్తనశాల. ఈ చిత్రం అంటే సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, హీరో బాలకృష్ణకు కూడా అమితమైన ఇష్టం. అందుకే తాను హీరోగా "నర్తనశాల" చిత్రాన్ని ప్రారంభించారు. ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడుగా శ్రీహరి, అర్జునుడు పాత్రలో బాలయ్య నటిస్తూ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే, హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోవడంతో, పలు కారణాల వల్ల చిత్ర షూటింగ్ ఆగిపోయింది. 
 
అయిత, ఇపుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ నెల 24వ తేదీ విజయదశమి పండుగను పురస్కరించుకుని దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా రిలీజ్ చేయనున్నారు. 
 
దీన్ని ఓటీటీ ద్వారా విడుద‌ల‌ చేయనున్నారు. అయితే, ఈ సినిమా చూడాలంటే రూ.50 పెట్టి టికెట్ కొనాల్సిందే. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావించారు. 
 
బాల‌య్య అభిమానులైతే ఎంతైనా పెట్టి టికెట్ కొన‌వ‌చ్చున‌ని అన్నారు. దీంతో కొంత మంది అభిమానులు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు పెట్టి టిక్ కొనాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. వారి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ ఎవ్వరి మాటా వినరు, ఆయనంతే.. అదోటైపు