మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (09:59 IST)
మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  ఆదివారం వేకువజామున మృతి చెందిన సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై ఆయన స్పందించారు. 
 
"కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని సంపాదించుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమైన విషయం" అంటూ ట్వీట్​ చేశారు.
 
అలాగే సీనియర్ హీరో మోహన్ బాబు స్పందిస్తూ, "సోదర సమానుడైన కృష్ణంరాజు మరణ వార్త విన్న తర్వాత మాటలు రావడం లేదు" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ట్విట్టర్​ వేదికగా ఆయన ట్వీట్​ చేశారు. 
 
సినీ హీరోయిన్ అనుష్క శెట్టి తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం తెలిపారు. "కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని, ఒక లెజండ్, విశాలహృదయుడు అయన కృష్ణంరాజు మా హృదయాల్లో జీవిస్తారని" పేర్కొన్నారు. 
 
"మా" అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు తన సంతాప సందేశంలో.. "గుండెపగిలిపోయింది. మా ఇంటి పెద్దను కోల్పోయాం" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments