మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ను పరిశీలించిన సిసోడియా

వరుణ్
గురువారం, 25 జులై 2024 (16:01 IST)
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇటీవల సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలా లేదని ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమల రావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పది పోలీసు బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మదనపల్లెకు వెళ్లి ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా సందర్శించి, అక్కడ పలు రికార్డులను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మదనపల్లె ఘటనపై కుట్ర కోణాన్ని వెలికితీసే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ ఘటనలో సిబ్బంది ప్రమేయం ఉందా? లేక బయటి వ్యక్తుల పనా? అనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనలో రెవెన్యూ, పోలీసుల విచారణ సమాంతరంగా సాగుతోందని పేర్కొన్నారు.
 
రెవెన్యూ శాఖకు సంబంధించి 2,400 ఫైళ్లు కాలిపోయాయని సిసోడియా వెల్లడించారు. దాదాపు 700 ఫైళ్లను రికవరీ చేయగలిగామని, కాలిపోయిన ఫైళ్లను రీక్రియేట్ చేస్తున్నామని వివరించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో జులై 10వ తేదీ నుంచి సీసీ టీవీ కెమెరాలు పనిచేయడంలేదని గుర్తించామని సిసోడియా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments