పూరికి నో చెప్పి తప్పు చేసాను : నటుడు సంపూర్ణేశ్ బాబు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:04 IST)
హాస్య నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సంపూర్ణేశ్ బాబు. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించాడు. ఈ మేరకు మొదటి నుండి కూడా తనకు నాటకాలు.. డ్రామాలు అంటే ఇష్టమనీ... అలాగే కొంతమంది ఆర్టిస్టుల వాయిస్‌తో మిమిక్రీ చేసేవాడిననీ చెప్పుకొచ్చిన సంపూ బాబు... ఇలా నటనపై తనకు ఉన్న ఆసక్తితోనే ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
 
కాగా, 'హృదయ కాలేయం' విడుదలైన తర్వాత, దర్శకుడు పూరి జగన్నాథ్ తనను పిలిపించి మరీ, 'లోఫర్'లో ఒక వేషం వేయమని చెప్పగా... ఆ సమయంలో తాను హీరోగా చేసిన 'కొబ్బరిమట్ట' విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో.. 'ఇప్పుడు చేయలేను సార్' అని చెప్పేసి పొరపాటు చేసాననీ... అలా పూరి సినిమాలో ఛాన్స్‌ను వదులుకోవడమే తాను చేసిన తప్పు అని ఇప్పటికీ అనుకుంటూ ఉంటానని ఈ సందర్భంగా ఆయన వాపోయారు. కాగా, ఆ తర్వాత పూరిగారిని కలిసి వేషం ఇవ్వమని అడిగినట్లు చెప్పుకొచ్చిన సంపూ బాబు... ఇంతవరకూ ఇవ్వలేదు. త్వరలో ఇస్తారేమో చూడాలి అంటూ ఆశాభావం వ్యక్తం చేసాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

మద్యపానంతో భార్యాభర్తలు గొడవలు.. నలుగురు సభ్యుల మిస్సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments