Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌ నుంచి కబురందుకున్నారట హీరోయిన్‌ సమంత

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (11:33 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలోని 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు సమంత.
 
ఈ నేపథ్యంలో సమంత ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి కబురు అందుకుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి దర్శకత్వంలో 'కింగ్‌ ఆఫ్‌ కోథా' అనే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా తెరకెక్కనుంది.
 
ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు చిత్రయూనిట్‌ సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ యాడ్‌లో దుల్కర్, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్‌తో సినిమా వార్త నిజమైతే సమంతకు మలయాళంలో ఇదే తొలి సినిమా అవుతుంది. అలాగే హిందీ, కన్నడంలో కూడా సమంత సినిమాలు చేయలేదు.
 
అయితే బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్, ఆయుష్మాన్‌ ఖురానా, రణ్‌వీర్‌ సింగ్‌లతో సినిమాలు చేసేందుకు సమంత అంగీకరించారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments