Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ బస్టాండ్‌లో ఒంటరిగా సాయిపల్లవి.. ఏమైంది..?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (17:51 IST)
సహజనటి సాయిపల్లవి వరంగల్లో ప్రత్యక్షమైంది. అదీ కూడా ఒంటరిగా కూర్చుని కనిపించింది. సాధారణ ప్రయాణీకురాలిగా అందరితో కలిసిపోయింది. పది నిమిషాల పాటు బస్టాండ్లో కూర్చునే ఉంది. ఎవరూ ఆమెను గమనించలేదు. అయితే ఆమె మాత్రం పది నిమిషాల పాటు బస్టాండ్లోనే కూర్చుండి పోయింది.
 
అసలు ఎందుకు సాయిపల్లవి వరంగల్ బస్టాండ్లో కూర్చుందో ఆ తరువాత గానీ అక్కడున్న వారికి అర్థం కాలేదు. విరాట పర్వం షూటింగ్‌లో భాగంగా సాయిపల్లవి అక్కడ కూర్చుంది. కెమెరామెన్ కూడా రహస్యంగా విజువల్స్‌ను కెమెరా ద్వారా చిత్రీకరించారు. 
 
అయితే సాయిపల్లవి పైకి లేచి వెళ్ళేటప్పుడు మాత్రం కొంతమంది గుర్తుపట్టారు. సాయిపల్లవి అంటూ గట్టిగా అరిచారు. ఇంతలో చుట్టూ కూర్చున్న యూనిట్ సభ్యులు అభిమానులు ఆపేశారు. సాయిపల్లవి అక్కడి నుంచి లేచి కారు ఎక్కి వెళ్ళిపోయారు. 
 
తెలంగాణా యాసలో సాయిపల్లవి ఈ సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పటికే ఫిదా సినిమాతో తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సాయిపల్లవి. విరాట పర్వంలో రానా హీరో. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments