Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్య బయోపిక్.. సాయిపల్లవి తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (13:43 IST)
అందాల రాశి సౌందర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం, అభినయంతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది సౌందర్య. కానీ విమాన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో సినీ ప్రేక్షకులు షాకయ్యారు. ఈ నేపథ్యంలో సౌందర్య బయోపిక్ రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. దివంగత నటి సౌందర్య బయోపిక్‌ని రూపొందించడానికి ఓ మలయాళ సినీ నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. 
 
కర్ణాటకలో జన్మించిన సౌందర్య దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. దాదాపు అన్ని దక్షిణాది భాషల్లోని అగ్రనటులతో ఆమె నటించారు. ఇక 2004లో బీజేపీ పార్టీ ప్రచారం కోసం వెళ్లిన సమయంలో హెలీకాఫ్టర్‌ ప్రమాదంలో ఆమె మృతి చెందారు.
 
సౌందర్య పాత్రకు సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. సహజ నటిగా పేరు సంపాదించిన సాయి పల్లవి అయితే సౌందర్య పాత్రకి సరిగ్గా సరిపోతుందని నిర్మాత భావిస్తున్నారట.
sai pallavi


ఈ మేరకు నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఏరికోరి పాత్రలను ఎంచుకుంటున్న సాయి పల్లవి ఈ బయోపిక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments