Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయిపల్లవికి సిస్టర్ సెంటిమెంట్ కలిసొస్తుందా? చిరుకు బన్నీకి చెల్లెమ్మగా ఫిదా భామ..?

సాయిపల్లవికి సిస్టర్ సెంటిమెంట్ కలిసొస్తుందా? చిరుకు బన్నీకి చెల్లెమ్మగా ఫిదా భామ..?
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (19:43 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి విరాట పర్వం చిత్రంలో తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనుంది. అలాగే లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.  
 
ప్రస్తుతం క్లైమాక్స్‌తోపాటు.. ఓ పాటను చిత్రీకరిస్తోంది. ఈ సినిమాతో పాటు సాయిపల్లవి.. నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. యువ దర్శకుడు విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్‌ ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ సినిమాలో నటించడానికి గాను సాయి పల్లవి రెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. 
webdunia
pushpa movie title
 
సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పలో కూడా సాయిపల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలో పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ భావిస్తోంది. 
 
కాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది. అది ఏమంటే.. సాయిపల్లవి పుష్ప చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబంధించి ఇటీవలే దర్శకుడు సుకుమార్ ఆమెకు తన పాత్ర గురించి వివరించాడని.. నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషమేమంటే.. సాయి పల్లవి ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు చెల్లెలుగా నటిస్తోందని తెలుస్తోంది. దీనిపై కొంత స్పష్టత రావాల్సిఉంది. 
 
దీంతో పాటు చిరంజీవి సినిమాలో కూడా సాయిపల్లవి నటిస్తోందట. ఆచార్య సినిమాకు తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అజిత్ హీరోగా తమిళంలొ వచ్చిన 'వేదాళం' సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నాడు. 
 
సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రలో సాయి పల్లవి నటించనుందని సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కూడా చిరంజీవి, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో చేయనున్నట్టు సమాచారం.
 
ఇక ఇటు సినిమాలతో పాటు సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ రాబోతోంది. నాలుగు కథల సమాహారంగా రూపొందనున్న ఈ వెబ్‌ సిరీస్‌కి గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్‌ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్‌ చేయబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో విజయ్ దేవరకొండ సినిమా