Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ అంటే హడలిపోతున్న హీరోలు

తెలుగు సినీ ప్రేక్షకులను "ఫిదా" చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (10:28 IST)
తెలుగు సినీ ప్రేక్షకులను "ఫిదా" చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు. 
 
సాధారణంగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఈ సూత్రాన్ని మాత్రం ఈ అమ్మడు మరిచిపోయినట్టుంది. అందుకే పొగరు తలకెక్కింది. తన తీరుతో చిత్రబృందాన్ని తెగ విసిగించేస్తోందట. ప్రస్తుతం ఆమె రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ఒకటికాగా, ఎంసీఏ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోని టెక్నీషియన్స్, హీరోల ఓపికను పరీక్షిస్తోందట ఈ ముద్దుగుమ్మ.
 
నాగశౌర్య చిత్రం కోసం హీరోతో సహా చిత్ర యూనిట్ అంతా ఉదయం 9:30కి వచ్చి షూటింగ్ స్పాట్‌లో కూర్చుంటే ఈ అమ్మడు మాత్రం తనకు ఇష్టమొచ్చిన 11 లేదా 12 గంటలకో వస్తోందట. సాయి పల్లవి తీరు కారణంగా నాగశౌర్య ఈ ప్రాజెక్ట్‌నే వదులుకునేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. దర్శకులు చెప్పినప్పటికీ ఈ అమ్మడు వైఖరిలో మాత్రం మార్పురావడం లేదట. దీంతో దర్శక నిర్మాతల నుంచి హీరోలు సైతం విసిగిపోతున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments