Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' మూవీ 'బాహుబలి' రికార్డును తిరగరాస్తుందా?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (13:33 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం "సాహో". ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. 
 
'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో' కావడంతో ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అటు ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సాహో రెండో మేకింగ్ వీడియోను ఆదివారం హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేశారు. 
 
ఈ మేకింగ్ వీడియో ఇపుడు యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ప్రోమో చూస్తే మూవీలో యాక్షన్ సీన్స్ అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఊహించినట్లే ఈ వీడియోకు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 12 గంటల్లోనే 70 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం. 
 
అన్ని భాషల్లో రిలీజ్ చేసిన వీడియోలు అన్నింటికీ కలిపి ఈ వ్యూస్ వచ్చినట్లు సాహో టీమ్ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా నిర్మిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments