Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో రిస్కీ ఫైట్స్.. అమెరికాకు వెళ్లిన డార్లింగ్.. ఎందుకు?

బాహుబలి సినిమాకు తర్వాత ''సాహో''లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫిట్‌నెస్‌పై కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకోసం అమెరికాకు కూడా వెళ్లాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కప

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (17:20 IST)
బాహుబలి సినిమాకు తర్వాత ''సాహో''లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫిట్‌నెస్‌పై కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకోసం అమెరికాకు కూడా వెళ్లాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సాహో కోసం రిస్కీ ఫైట్స్ చేయాల్సి వుంది. ఇందుకోసం ప్రభాస్ అమెరికాకు వెళ్లాడు. 'బాహుబలి' సినిమా సమయంలో ప్రభాస్ భుజానికి అమెరికాలో శస్త్ర చికిత్స జరిగింది. 
 
మళ్లీ ఫిట్‌నెస్ కోసం కసరత్తులు చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై సంప్రదింపులు జరిపేందుకు ప్రభాస్ అమెరికా వెళ్లినట్లు తెలిసింది. డాక్టర్ల సూచనలు తీసుకుని తిరిగొచ్చాక ప్రభాస్ దుబాయ్‌లో జరిగే ''సాహో'' సినిమా తదుపరి షెడ్యూల్‌లో పాల్గొంటాడని సమాచారం. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బేనర్‌పై సాహో నిర్మితమవుతుంది. 
 
మరోవైపు ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. మూడేళ్ళ క్రితమే ఓ హిందీ సినిమాని ఓకే చేశానని చెప్పారు. సాహో తర్వాత తాను చేయబోవు చిత్రం ఇదేనని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇది ప్రేమ కథా నేపథ్యంలో ఉంటుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments