Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్-చెర్రీతో రాజమౌళి సినిమా.. సంక్రాంతికి అధికారిక ప్రకటన

ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాహుబలి సినిమా మేకర్ రాజమౌళి.. ప్రస్తుతం తదుపరి సినిమా దృష్టి సారించారు. రాజమౌళి బాహుబలికి తర్వాత ఎన్టీఆర్-చెర్రీతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (16:43 IST)
ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాహుబలి సినిమా మేకర్ రాజమౌళి.. ప్రస్తుతం తదుపరి సినిమా దృష్టి సారించారు. రాజమౌళి బాహుబలికి తర్వాత ఎన్టీఆర్-చెర్రీతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత వుంటుందని ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇకపోతే.. ఈ సినిమాపై అధికార ప్రకటన కోసం రాజమౌళి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దర్శకధీరుడు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతికి అధికారిక ప్రకటన చేసే ఈ మల్టీస్టారర్ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌పైకి రానుంది. దాదాపు పదినెలల పాటు నిర్విరామంగా ఈ షూటింగ్ జరుగుతుందని టాక్. 
 
ఇందులో భాగంగా బోయపాటితో చరణ్ .. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేసే సినిమాలు, అక్టోబర్ నాటికి పూర్తయ్యేలా చూసుకోమని ఇద్దరు హీరోలకి రాజమౌళి చెప్పారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ల కోసం రాజమౌళి వేట మొదలెట్టారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments