Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' చిత్రం సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఎంత వసూలు కావాలో తెలుసా?

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (18:43 IST)
బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' మరో నాలుగు రోజుల్లో థియేటర్‌లలోకి రాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. 
 
గతేడాది సౌత్ నుంచి భారీ క్రేజ్‌తో రజనీ నటించిన 2.0 సినిమా రిలీజైంది. అయితే కొంత డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు ఆ రేంజ్ క్రేజ్‌తోనే ఇప్పుడు సాహో చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం దాదాపు రూ. 320 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం అందుతుంది.  
 
దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.350 కోట్ల వరకు షేర్ రావాలి. అలా వస్తేనే సినిమా సేఫ్‌ జోన్‌లోకి వెళ్తుంది. బాహుబలి సినిమాల మాదిరి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే.. సినిమాకు లాభాలు రావడం పెద్ద విషయమేమీ కాదు.  ఒకవేళ ప్రతికూలంగా టాక్ వస్తేనే ఎలా అన్నది ఆలోచించాలి. 
 
ప్రభాస్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెన్సార్ రిపోర్ట్‌ల ప్రకారం సినిమా అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్ట్ 30వ తేదీ వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

వంట సరిగ్గా వండలేదని కొబ్బరి తురుముతో భార్యను హత్య చేసేశాడు.. ఎక్కడ?

Cow attack: ఏపీలో ఆవుల దాడి.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు (video)

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments