Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ప్రియురాలి కాల్ డేటాలో 'ఏయు'... ఎవరా ఏయూ??

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (09:12 IST)
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసును ఇప్పటికే సీబీఐ విచారిస్తోంది. అలాగే, సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి కోట్లాది రూపాయలు బదిలీ అయ్యాయన్న ఫిర్యాదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో సోదరుడు శోవిక్‌, తండ్రి ఇంద్రజిత్‌, మాజీ మేనేజర్‌ శృతి మోడీ, సిద్దార్థ్‌ పితానిని విచారించారు. 
 
ఈ దర్యాప్తులో భాగంగా రియాతోపాటు ఆమె సోదరుడు, తండ్రి ఫోన్లను అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఫోరెన్సిక్‌ ఎగ్జామినేషన్‌ కోసం ల్యాప్‌టాప్‌, ఐప్యాడ్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే రియా చక్రవర్తి కాల్‌ రికార్డులో ఓ అనుమానాస్పద పేరును ఈడీ అధికారులు గుర్తించారు.
 
రియా కాల్‌ చేసిన ఓ ఫోన్‌ నంబర్‌ ఏయూ పేరుతో ఉందట. అయితే ఏయూ ఎవరనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీయగా.. అది అన్నయ ఉద్ధస్‌ అనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ నంబర్‌ అని, ఆ వ్యక్తికి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని నిర్దారణకు వచ్చారని తెలుస్తోంది. సుశాంత్‌ ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments