Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ప్రియురాలి కాల్ డేటాలో 'ఏయు'... ఎవరా ఏయూ??

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (09:12 IST)
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసును ఇప్పటికే సీబీఐ విచారిస్తోంది. అలాగే, సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి కోట్లాది రూపాయలు బదిలీ అయ్యాయన్న ఫిర్యాదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో సోదరుడు శోవిక్‌, తండ్రి ఇంద్రజిత్‌, మాజీ మేనేజర్‌ శృతి మోడీ, సిద్దార్థ్‌ పితానిని విచారించారు. 
 
ఈ దర్యాప్తులో భాగంగా రియాతోపాటు ఆమె సోదరుడు, తండ్రి ఫోన్లను అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఫోరెన్సిక్‌ ఎగ్జామినేషన్‌ కోసం ల్యాప్‌టాప్‌, ఐప్యాడ్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే రియా చక్రవర్తి కాల్‌ రికార్డులో ఓ అనుమానాస్పద పేరును ఈడీ అధికారులు గుర్తించారు.
 
రియా కాల్‌ చేసిన ఓ ఫోన్‌ నంబర్‌ ఏయూ పేరుతో ఉందట. అయితే ఏయూ ఎవరనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీయగా.. అది అన్నయ ఉద్ధస్‌ అనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ నంబర్‌ అని, ఆ వ్యక్తికి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని నిర్దారణకు వచ్చారని తెలుస్తోంది. సుశాంత్‌ ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments