Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మ పడుద్ది : 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'కు లైన్ క్లియర్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (14:00 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. మార్చి 25వ తేదీన.. ఈసీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019, మార్చి 29వ తేదీ సినిమా విడుదల ఉంటుందని తెలిపారు. మూవీ రిలీజ్ తర్వాత అభ్యంతరాలు ఉంటే.. మళ్లీ వివరణ ఇస్తామన్నారు. జగన్‌తో బంధుత్వం లేదని.. కేవలం పార్టీ అధినేతగా మాత్రమే పరిచయం అని స్పష్టం చేశారాయన. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రాసిన పుస్తకం ఆధారంగా సినిమా నిర్మించడం జరిగిందని ప్రకటించారు. 
 
పోలింగ్‌కు 13 రోజుల ముందు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కావటంపై టీడీపీ నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబును విలన్‌గా చూపించారంటూ.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయ సినిమా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ అభిమానులు. దీంతో నిర్మాత రాకేష్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. 
 
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఆయన ఈసీ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం లైన్ క్లియర్ కావడంతో మార్చి 29వ తేదీన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments