హీరోయిన్ల క్యారెక్టర్‌పై కామెంట్లా.. ఎంత మందితో పడుకుందని..?

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (10:18 IST)
హీరోయిన్ల క్యారెక్టర్‌పై దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ అన్నారు. హీరోయిన్లపై వచ్చే కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి లుక్‌పై, యాక్టింగ్ కామెంట్స్ చేయవచ్చునని.. క్యారెక్టర్‌పై మాత్రం కామెంట్స్ చేయకూడదని చెప్పారు. 
 
ఎంత మందితో పడుకుంది అని మాట్లాడుతూ ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారని రేణూ దేశాయ్ తెలిపారు. ఇలాంటివి మానుకోవాలని సూచించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై రాజకీయ విమర్శలు చేసినా, ఆయన మేనిఫెస్టోను విమర్శించినా తనకు ఇబ్బందిలేదన్నారు 
 
అయితే ప్రతిసారీ తనను, తన పిల్లలను లాగడం ఏమిటని ప్రశ్నించారు. తమను టార్గెట్ చేయడం మరీ ఎక్కువవుతోందని.. దాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిదన్నారు. అలాగే అకీరానందన్‌ బర్త్ డే సమయంలో నెలకొన్న వివాదానికి క్లారిటీ ఇచ్చింది.  
 
ఇక రేణు దేశాయ్‌ ఇటీవల "టైగర్‌ నాగేశ్వరరావు" చిత్రంలో హేమలత లవణం పాత్రలో నటించింది. రియల్‌ లైఫ్‌లో ఉన్న పాత్ర ఆమెది. సినిమాలో చివరి పది నిమిషాల్లో వచ్చింది రేణు దేశాయ్‌.

అయితే సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని అంతా భావించారు. టీమ్‌ కూడా అలానే చెప్పొకొచ్చింది. కానీ తీరా ఆమె పాత్ర నిడివి మరీ తక్కువగా ఉండటం, పైగా అది బలంగా లేకపోవడంతో ఆడియెన్స్‌ని నిరాశ పరిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments