Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను : రేణూ దేశాయ్

renu desai
, సోమవారం, 16 అక్టోబరు 2023 (10:32 IST)
రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "టైగర్ నాగేశ్వర రావు". ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. అభిషేక్ నామా నిర్మాత. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ-రీలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించిన నటి రేణూ దేశాయ్ కూడా పాల్గొని ప్రసంగించారు. 
 
తాను ఇండస్ట్రీకి వచ్చి 23 యేళ్లు అయింది. అయినా తాను నటించిన "బద్రీ" చిత్రం ఇటీవలే విడుదలైందనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇంతకాలంగా తాను తెలుగు సినిమాలు చేయకపోయినా, మీరంతా అదే ప్రేమను చూపిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతూ వచ్చారు.. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు. 
 
అలాగే, ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదలు. హీరో రవితేజ వంటి సీనియర్ హీరోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ప్రాధాన్యత ఉందో ఆయనకి తెలియదు. ఈ వేదిక ద్వారా.. పర్సనల్ గాను రవితేజకు థ్యాంక్స్ చెబుతున్నాను. అంతా కూడా ఈ నెల 20వ తేదీన థియేటర్స్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని రేణూ దేశాయ్ అన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ 7: ఆరో వారం ఎలిమినేట్ అయ్యిందెవరు?