సిద్ధార్థ్ మ‌ల్హోత్రా జోడీగా 'మిష‌న్ మ‌జ్ను'తో ర‌ష్మికా మంద‌న్న బాలీవుడ్ ఎంట్రీ

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (18:24 IST)
సౌత్ బ్యూటీ, టాలీవుడ్‌లో అచిర‌కాలంలోనే అగ్ర‌శ్రేణి తార‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మికా మంద‌న్న బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న 'మిష‌న్ మ‌జ్ను' మూవీలో ఆమె నాయిక‌గా ఎంపిక‌య్యారు. ఈ బిగ్ ఫిల్మ్‌లో భాగం కావడంతో ఆమె ఎగ్జ‌యిట్ అవుతున్నారు.
 
శంత‌ను బాగ్చి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా రా ఏజెంట్‌గా న‌టిస్తున్నారు. ప‌ర్వీజ్ షేక్‌, అసీమ్ అరోరా, సుమిత్ బ‌తేజా ర‌చ‌న చేస్తున్న 'మిష‌న్ మ‌జ్ను'ను గూల్టీ, ఆర్ఎస్‌వీపీ బ్యాన‌ర్ల‌పై అమ‌ర్ బుటాలా, గ‌రిమా మెహ‌తా, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.
 
య‌థార్థ ఘ‌ట‌న‌ల ప్రేర‌ణ‌తో, భార‌త‌దేశ‌పు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో 'మిష‌న్ మ‌జ్ను' రూపొందుతోంది. తెలుగులో అల్లు అర్జున్‌తో 'పుష్ప‌', శ‌ర్వానంద్ జోడీగా 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమాల‌ను ర‌ష్మిక చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments