Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సమంత సవాల్.. రష్మిక మందన థ్యాంక్స్

Webdunia
గురువారం, 16 జులై 2020 (10:57 IST)
Rashmika Mandanna
తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఊపందుకుంది. ఇందులో భాగంగా సెలెబ్రిటీలు మొక్కలు నాటుతూ ఇతరులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాటు.. వర్షాలు కూడా కురవడంతో మొక్కలు నాటే కార్యక్రమం మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో ఇప్పటికే చాలా మంది సెలెబ్రీటీలు పాల్గొన్నారు. 
 
తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని తన మామ నాగార్జునతో కలిసి మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత మరో టాప్ హీరోయిన్ రష్మిక మందనకు ఛాలెంజ్ విసిరింది. దీంతో ఈ ఛాలెంజ్‌లో భాగంగా రష్మిక మందన తాజాగా సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది. అంతేకాదు ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ అభిమానులతో షేర్ చేసుకుంది.
 
ఈ సందర్భంగా మరో ఇద్దరు రాశిఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్‌కు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరింది. తను గ్రీన్‌ ఛాలెంజ్‌ లాంటి గొప్ప కార్యక్రమంలోకి ఆహ్వానించిన అక్కినేని సమంతకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే  తన అభిమానులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments