Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు సినిమాల నిలుపుదలకు హైకోర్టు నో చెప్పేసింది...

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:12 IST)
లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదల నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సత్యనారాయణ వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు సినిమాల విడుదల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
 
మహానటుడు ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెరకెక్కించాడు. ఈ చిత్రం త్వరలో సెన్సార్ కార్యక్రమాలను జరుపుకొని మార్చి 29న విడుదల కానుంది. 
 
మరోవైపు వీరగ్రంథం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీ పార్వతి..ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించారు..అటు తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం’ సినిమా తెరకెక్కించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments