Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల చిత్రంలో రైతుగా చిరంజీవి.. అతిథి పాత్రలో చెర్రీ

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (13:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే, మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో చిరంజీవి ఒక రైతుగా కనిపించనున్నారు. ఇందులో ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో నటించనున్నారు. 
 
ఇప్పటికే ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిన కొరటాల, త్వరలో చిరంజీవికి వినిపించడానికి రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో చిరంజీవి పెద్దరికానికి తగినట్టుగానే ఆయన పాత్ర ఉంటుందన్నారు. రైతు పాత్రలో చిరంజీవిని చూపిస్తూ.. సామాజిక సందేశంతో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. జనవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకునే ఈ భారీ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 
 
ఇక ఈ సినిమాలో ఒక సందర్భంలో చరణ్ కూడా కనిపించనున్నారు. చిరూ.. చరణ్‌లతో మాట్లాడిన తర్వాతనే కొరటాల ఆ సీన్ రాసుకున్నట్టు సమాచారం. గతంలో 'మగధీర', 'బ్రూస్లీ' సినిమాల్లో చరణ్‌తో కలిసి చిరంజీవి అభిమానులకి ఆనందాన్ని కలిగించారు. ఈసారి చిరూతో కలిసి చరణ్ మెరిసి అభిమానుల ముచ్చట తీర్చనున్నాడన్న మాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు

Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments