Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో సందడి చేస్తున్న రామ్ చరణ్... అయ్యప్ప మాలను తొలగించిన చెర్రీ (video)

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (13:08 IST)
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అమెరికాలో సందడి చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు గుడ్‌ మార్నింగ్ అమెరికా టాక్ షో నిర్వహిస్తుంటారు. ఆస్కార్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క రామ్ చరణ్‌కు మాత్రమే ఆహ్వానం లభించింది. ఇందుకోసం ఆయన ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఆయన అమెరికా వెళ్లే సమయంలో అయ్యప్ప మాల ధరించి వున్నారు. కానీ, శుక్రవారం ఆయన మాలను తీసివేసి.. సూటుకోటులో కనిపించారు. భారత్‌లో తాను ధరించిన అయ్యప్ప మాలను అమెరికాలో రామ్ చరణ్ తొలగించారు. 
 
అలా చేయడానికి కారణం లేకపోలేదు.. చెర్రీ అర్థ మండల దీక్షను మాత్రమే చేపట్టారు. అంటే ఈ దీక్ష 21 రోజుల పాటు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ నెలారంభంలో ఈ దీక్షను ప్రారంభించిన చెర్రీ.. 21 రోజులు పూర్తి చేసుకోవడంతో అక్కడ ఉన్న ఒక ఆలయం వద్ద సంప్రదాయ పద్దతి ప్రకారం ఆయన మాలను తీసినట్టు సమాచారం. 
 
కాగా, గుడ్‌ మార్నింగ్ అమెరికా టాక్ షోకు టాలీవుడ్ నుంచే కాకుండా అమెరికా నుంచి ఆహ్వానం అందుకున్న తొలి సినీ సెలెబ్రిటీ చెర్రీ కావడంతో మెగా ఫ్యామిలీ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు విషెస్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments