విజయ్ దేవరకొండతో రాశి ఖన్నా... కుర్రకారుకు పండగేనంటున్న ఫిల్మ్ నగర్

'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి గుర్తింపు పొందిన హీరో విజయ్ దేవరకొండ. ఆగస్టు 15వ తేదీన "గీత గోవిందం" చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకురానున్నారు. అయితే, విజయ్ దేవరకొండతో స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా జతకట్

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (11:53 IST)
'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి గుర్తింపు పొందిన హీరో విజయ్ దేవరకొండ. ఆగస్టు 15వ తేదీన "గీత గోవిందం" చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకురానున్నారు. అయితే, విజయ్ దేవరకొండతో స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా జతకట్టనుంది. 
 
'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు', 'ఓన‌మాలు' ఫేం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కే చిత్రంలో రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి క‌థానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుపుతున్నారు. ఇందులోభాగంగా, పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు.
 
చివరకు అందాల భామ రాశీ ఖ‌న్నాని హీరోయిన్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. చిత్రంలో హీరో పాత్ర‌కి స‌మానంగా హీరోయిన్ పాత్ర ఉంటుంద‌ట‌. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రాల‌న్నీ మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ చిత్రం కూడా మంచి హిట్ కొడుతుంద‌ని భావిస్తున్నారు. 
 
మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'గీత గోవిందం' ఆగ‌స్టు 15న విడుద‌ల కానుండ‌గా, 'టాక్సీవాలా' చిత్రం విడుద‌ల‌కి సిద్ధమవుతోంది. మ‌రో వైపు బైలింగ్యువ‌ల్ మూవీ 'నోటా' చేస్తున్నాడు. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానరులో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడట. 
 
ఇక అదేకాకుండా రాజు డి.కె. దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్ర‌స్తుతం భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్‌‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ 'డియ‌ర్ కామ్రేడ్' అనే చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు కూడా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments