Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హ‌ర్షి టీమ్‌కి షాక్ ఇచ్చిన వంశీ..!

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హ‌గ్డే  నటిస్తుంటే...అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్పాట్ లోని కొన్ని ఫోటోలు అలాగే ఒక వీడియో కూడా లీకైన సంగతి తెలిసిందే. కొంత మంది ఆకతాయిలు, అత్యుత్సాహం ఉన్నవారు ఇలా ఫోటోలు షూటింగ్ వీడియోలు అలాగే ఎడిటింగ్ సమయంలో సినిమా క్లిప్స్‌ని లీక్ చేసిన సందర్భాలు మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఉన్నాయి. కానీ ఈ లీకుల బెడద మాత్రం పోవ‌డం లేదు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించి ఏదోటి లీక‌వుతుండ‌డంతో ఈ సినిమా విషయంలో వంశీ ఇక నుంచి కాస్త పగడ్బందీగా వ్యవహరించాలని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అది ఏంటంటే... ఈ సినిమాకి పని చేసే ఏ ఒక్కరి దగ్గర ఆ సినిమా షూటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉండకూడదు అని ఆంక్షలు విధించినట్టు తెలిసింది. సినిమా షూటింగ్ మొదలు పెట్టే ముందే ఏ ఒక్కరు లొకేషన్ కి మొబైల్స్ తీసుకురాకూడదని ప్రతీ ఒక్కరికి స్ట్రిక్ రూల్స్ పెట్టి వంశీ షాకిచ్చాడ‌ట‌. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments