Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హ‌ర్షి టీమ్‌కి షాక్ ఇచ్చిన వంశీ..!

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హ‌గ్డే  నటిస్తుంటే...అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్పాట్ లోని కొన్ని ఫోటోలు అలాగే ఒక వీడియో కూడా లీకైన సంగతి తెలిసిందే. కొంత మంది ఆకతాయిలు, అత్యుత్సాహం ఉన్నవారు ఇలా ఫోటోలు షూటింగ్ వీడియోలు అలాగే ఎడిటింగ్ సమయంలో సినిమా క్లిప్స్‌ని లీక్ చేసిన సందర్భాలు మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఉన్నాయి. కానీ ఈ లీకుల బెడద మాత్రం పోవ‌డం లేదు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించి ఏదోటి లీక‌వుతుండ‌డంతో ఈ సినిమా విషయంలో వంశీ ఇక నుంచి కాస్త పగడ్బందీగా వ్యవహరించాలని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అది ఏంటంటే... ఈ సినిమాకి పని చేసే ఏ ఒక్కరి దగ్గర ఆ సినిమా షూటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉండకూడదు అని ఆంక్షలు విధించినట్టు తెలిసింది. సినిమా షూటింగ్ మొదలు పెట్టే ముందే ఏ ఒక్కరు లొకేషన్ కి మొబైల్స్ తీసుకురాకూడదని ప్రతీ ఒక్కరికి స్ట్రిక్ రూల్స్ పెట్టి వంశీ షాకిచ్చాడ‌ట‌. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

చిత్తూరు నుంచి చెన్నై - బెంగుళూరుకు జస్ట్ ఓ గంటన్నర మాత్రమే జర్నీ....

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments