Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని.. హిందీ టీవీ ఆర్టిస్ట్ కుమార్తె మృతి

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (18:27 IST)
పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే ఆ బొమ్మలే పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. అవును.. తాజాగా ఆడుకునే బొమ్మను మింగిన నటుడి కుమార్తె మృతి చెందింది. హిందీ టీవీ ఇండస్ట్రీ నటుడు ప్రతీష్ వోరా కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. ప్లాస్టిక్ బొమ్మను మింగింది. 
 
పాప ఏడుస్తుంటే ఆకలి అనుకున్నారు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపకపోవడంతో పాటు ఊపిరాడకపోవడంతో ఆస్పత్రికి తీసుకుని పరుగులు తీశారు. అప్పుడు కానీ విషయం తెలియలేదు.. చిన్నారి గొంతులో ఓ చిన్న బొమ్మ ఇరుక్కుందని. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు వెంటనే గొంతులోని బొమ్మను తలగించినా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 
 
ప్రతీష్ రెండేళ్ల కుమార్తె తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన హిందీ టీవీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఆయన కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదు.. కేవలం ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని చనిపోయిందని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ప్రతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హిందీ బుల్లితెర నటులు ప్రతీష్‌ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments