Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్టీస్టారర్ కాబోతున్న పుష్ప.. విక్రమ్ నటిస్తాడా?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (15:35 IST)
లాక్ డౌన్ తర్వాత అల్లు అర్జున్ తన ఫోకస్ మొత్తం పుష్ప సినిమాపై పెట్టాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలోని అడవి ప్రాంతంలో జరుగుతుంది. మరికొన్ని రోజులు అక్కడే చిత్రం షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే తొలి షెడ్యూల్ చివరి దశకు వచ్చింది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు సుకుమార్. 2022 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 
 
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో కూడా పుష్ప విడుదల కానుంది. దీనికోసం కథలో కూడా కొన్ని మార్పులు చేశాడు సుకుమార్. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ కథ ఉంటుందని.. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెబుతున్నాడు దర్శకుడు.
ఇందులో పుష్పక్ నారాయణ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రష్మిక మందన హీరోయిన్. 
 
కథలో ఈమె పాత్ర కూడా కీలకంగా ఉండబోతుంది. పూర్తిగా డి గ్లామరస్ పాత్రలో నటిస్తుంది రష్మిక. దానికి తోడు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్.. అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ దాదాపు 200 కోట్లకు పైగా జరుగుతుందని అంచనా. 
 
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సింగిల్ స్టారర్ సినిమాగా ఉన్న పుష్ప ఇకపై మల్టీస్టారర్ కాబోతుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. దాని కోసం ఇప్పటికే విజయ్ సేతుపతి, సముద్రఖని, సుదీప్, బాబీ సింహ లాంటి నటుల పేర్లు వినిపించాయి. అయితే కొన్ని డేట్స్ కారణంగా.. మరికొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి వాళ్ల తప్పుకున్నారు. ఇప్పుడు ఈ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్‌ను దర్శకుడు సుకుమార్ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments