రాజమౌళి చిత్రంలో.. అలా కోర్కె తీర్చుకోనున్న చిరంజీవి!

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (12:07 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసినటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ప్రొడక్షన్‌పై నటిస్తున్నారు. అయితే, ఇపుడు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కూడా భాగం కానున్నారనేదే ఆ వార్త. 
 
నిజానికి రాజమౌళి దర్శకత్వంలో నటించాలనివుందని చిరంజీవి గతంలో వ్యాఖ్యానించారు. కానీ, ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇపుడు చిరంజీవి దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో మాత్రం తెరపై కనిపించకుండానే ప్రేక్షకులను అలరించబోతున్నారు. 
 
ఈ సినిమాలో తారక్, రాంచరణ్ పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. దీనికి సంబంధించి రాజమౌళి ఫోన్ చేయగానే చిరంజీవి రెండో ఆలోచన చేయకుండానే ఓకే చెప్పేశారట. 
 
మరోవైపు హిందీ వర్షన్‌లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలియా భట్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments