Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజాంలో ప్రతి రోజు పండగే ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (19:36 IST)
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సూపర్ హిట్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ప్రతిరోజు పండగే. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లపై యువ నిర్మాత బన్నీ వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, ఎంటర్టైన్మెంట్ అంశాలు జోడించి తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని ప్రాంతాల ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ నైజాం ఏరియాలో రూ.22 కోట్ల గ్రాస్, అలానే రూ.10.59 కోట్ల షేర్ అందుకుని, ఇంకా దిగ్విజయంగా దూసుకెళ్తోంది. 
 
ఒక్క నైజాంలోనే కాకుండా... ఈ సినిమా అన్ని ప్రాంతాలలో దిగ్విజయంగా దూసుకెళ్తోంది. తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తేజ్ తాతయ్యగా సత్య రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. మరి.. ఫుల్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments