ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్.. మరి లక్ష్మీ పార్వతిగా ఎవరు?

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇప్పటికే ఆయన రిలీజ్ చేశ

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:34 IST)
స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇప్పటికే ఆయన రిలీజ్ చేశారు. ఇపుడు నటీనటుల ఎంపికపై ఆర్జీవీ దృష్టిసారించనున్నారు. 
 
ఈనేపథ్యంలో ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్‌తో చేయించాలనే తలంపులో వర్మ వున్నట్టు సమాచారం. ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడు .. హావభావాలను అద్భుతంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అందువల్ల ఆయనైతే ఎన్టీఆర్ పాత్రకి కరెక్ట్‌గా సెట్ అవుతాడని వర్మ భావిస్తున్నాడట. 
 
ప్రకాశ్ రాజ్‌తో సంప్రదింపులు జరపడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. ఇది నిజమే అయితే .. వివాద స్పదమైన ఈ సినిమాలో నటించడానికి ప్రకాశ్ రాజ్ అంగీకరిస్తారా? అనేదే ఆసక్తికరంగా మారింది. అలాగే, లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారోననే ఆత్రుత పెరుగుతోంది. 
 
కాగా, 1997 జనవరి 14వ తేదీన "ఇరువర్" అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ మరో హీరో పాత్ర పోషించారు. తమిళ మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీఆర్‌ స్నేహం, రాజకీయ వైరాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కరుణానిధి పాత్రను తమిళ్ సెల్వన్ పేరుతో ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరులో దారుణం: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments