హీరో సిద్ధార్థ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:12 IST)
హీరో సిద్దార్థ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను నటించిన కొత్త చిత్రం 'చిత్త'. శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో సిద్ధార్థ్ గురువారం బెంగుళూరు నగరంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీన్ని కొన్ని కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. తమ కావేరీ ఉద్యమానికి మద్దతు తెలుపాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో విలేకరుల సమావేశం నిర్వహించకుండా సిద్ధార్థ్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. చేతులు జోడించి, థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి సిద్ధార్థ్ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 
 
ఈ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. హీరో సిద్ధార్థ్‌కు సారీ చెప్పారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో సమస్య పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని కుంటి ఎంపీలను ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్యులు, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పని, అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెపుతున్నట్టు తన ఎక్స్ ఖాతాలో ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

Jana Sena: పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటు

విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ - స్కూల్‌కు కంప్యూటర్ల వితరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments