Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" మూవీ మేకర్స్‌పై కేసు నమోదు

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (08:33 IST)
"పుష్ప" మూవీ మేకర్స్‌పై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రీరిలీజ్ ‌ఈవెంట్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కె.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరెకెక్కిన "పుష్ప" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 12వ తేదీన యూసుఫ్ గూడలోని పోలీస్ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఐదు వేల మందితో నిర్వహిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అనుమతి తీసుకుంది. 
 
కానీ, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, హైదరాబాద్ నగర వాసులు తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అంయింది. అభిమానులను నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారింది. అలాగే, అనివార్య కారణాలతో ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ కూడా హాజరుకావడం లేదనే వార్త ప్రచారంలోకి వచ్చింది. 
 
దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఫ్యాన్స్... ఎన్ కన్వెన్షన్ గేట్‌ను కూడా విరగ్గొట్టారు. అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను చెదరగొట్టారు. అంతేకాకుండా, అల్లు అర్జున్ అభిమానులు చేసిన పనికి శ్రేయాస్ మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ యూనిట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్టెల్లాను పైకెత్తుకుని ముద్దెట్టిన జూలియన్ అసాంజే

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో గద్దలు... రూ.2096 కోట్ల నిధులుంటే.. మిగిలింది రూ.7 కోట్లే...

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments