Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్ని అరుదైన ఫొటోలను ఫోను కెమెరాలో బంధించాను : రేణూ దేశాయ్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (17:19 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో కింద.. కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేయాల్సిన అవసరం ఉంది అనే క్యాప్షన్ పెట్టారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రేణూ దేశాయ్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంది. పిమ్మట జనసేనాని పవన్ కల్యాణ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన నుంచి దూరమైన తర్వాత మరాఠి సినిమాల్లో ఆమె తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. 
 
అయితే, పిల్లలిద్దరినీ తన వద్దనే ఉంచుకుని ఒక తల్లిగా ఆమె వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తనకు వీలు ఉన్నప్పుడల్లా పూణెకు వెళ్లి తన పిల్లలతో సమయాన్ని గడుపుతుంటారు.
 
ఈ క్రమంలో రేణు దేశాయ్ తాజాగా ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ తన కుమారుడు, కుమార్తెను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె కామెంట్ పెట్టారు. 
 
కొన్ని అరుదైన ఫొటోలను తాను ఫోన్ కెమెరాతో తీశానని చెప్పారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలపై నెటిజెన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments