Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అజ్ఞాతవాసి' పారితోషికం ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తోంది. పవన్‌తో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ జతకలిస్తే ఇక చెప్పనక్కర్

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (14:25 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తోంది. పవన్‌తో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ జతకలిస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన చిత్రమే 'అజ్ఞాతవాసి'. గతంలో వీరిద్దరూ కలిసి తీసిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి. దీంతో 'అజ్ఞాతవాసి'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం కూడా.
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ చిత్రంలో నటించినందుకు హీరోగా పవన్ కళ్యాణ్, దర్శకత్వం వహించినందుకు త్రివిక్రమ్ ఏ మేరకు పారితోషికం తీసుకున్నారనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ మొదలైంది. అయితే, ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు 'అజ్ఞాతవాసి' సినిమాకిగాను త్రివిక్రమ్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకోగా, హీరో పవన్‌కి రూ.30 కోట్ల పారితోషికం ముట్టిందని చెప్పుకుంటున్నారు. ఇద్దరి పారితోషికమే రూ.50 కోట్ల వరకూ అయిందన్న మాట. ఇక యువ సంగీత దర్శకుడిగా అనిరుథ్ రవిచంద్రన్‌కు రూ.3 కోట్ల వరకూ ముట్టినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments