Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణుమాధవ్ మృతి.. పవన్ కల్యాణ్, చంద్రబాబు దిగ్భ్రాంతి..

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (16:44 IST)
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ బుధవారం కన్నుమూశారు. వేణు మాధవ్ మృతిపై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "అందరినీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారని అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. 
 
గోకులంలో సీత సినిమా నుంచి నాతో కలసి నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రీలో మంచి నైపుణ్యం ఉండడంతో సెట్లో ఆనందంగా ఉంచేవారు. వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారు. వేణుమాధవ్ మృతికి, నా తరఫున, జనసేన తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా'' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
మరోవైపు వేణు మాధవ్ మృతిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. ఆయన కుటుంబ సభ్యలకు అభిమానులకు సానుభూతి తెలిపారు. మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ మృతి టీడీపీకి, తెలుగు సినీరంగానికి తీరనిలోటన్నారు. టీడీపీని, ఎన్టీఆర్‌ను వేణుమాధవ్ ఎంతో అభిమానించేవారని చెప్పారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments