Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (20:09 IST)
బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేసిన కేసులో ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం అతడిని స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించినట్లు సమాచారం.
 
బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్న పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టైటిల్ గెలుచుకున్న ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. 
 
అయితే అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ కూడా బయటకు రావడంతో ఇద్దరి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. అమర్‌దీప్‌ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు. మరో పోటీదారుడు అశ్విని కారు అద్దాలు పగలగొట్టాడు. 
 
పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌ కారు అద్దంతో పాటు విధులు నిర్వహించేందుకు వచ్చిన బెటాలియన్‌ బస్సు అద్దాన్ని పగులగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా, అతని స్నేహితుడు వినయ్‌ను ఏ-3గా చేర్చారు. అయితే ఈ కేసులో ఏ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్లలో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25), అంకిరావుపల్లి రాజు (23)లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments