Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు లైన్ క్లియర్.. మేం ఆపలేమన్న సీఈవో

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (11:09 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' పేరిట ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని నెగటివ్ రోల్‌లో వర్మ చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. దీని ఫలితం ఎన్నికల ప్రభావంపై వుంటుందని టాక్ వస్తోంది. ఇందుకోసం ఈ సినిమా విడుదలను ఆపేయాలని టీడీపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఆపే సీన్ లేదని ఈసీ తేల్చేసింది. 
 
తాజాగా తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై స్పందిస్తూ మార్చి 22న విడుదల కానున్న ఈ సినిమాను అడ్డుకోలేమని స్పష్టం చేశారు. నిజంగానే ఈ సినిమాలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుంటే రిలీజ్ తర్వాతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మార్చి 22న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments