Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి తలసానితో ‘మా’ నూతన కార్యవర్గం భేటీ.!

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (22:08 IST)
నూతనంగా ఎన్నికైన ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్, జాయింట్ సెక్రెటరీ శివబాలాజీ, ఈసీ మెంబర్ సురేష్ కొండేటితో పాటు మరికొంత మంది సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన ‘మా’ కార్యవర్గానికి మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ నూతన అధ్యక్షుడు వీకే నరేష్.. మంత్రి తలసానితో దాదాపు ముప్పావు గంటపాటు చర్చించారు.
 
‘మా’లో ఉన్న సమస్యలను మంత్రికి వివరించారు. ‘మా’ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయాన్ని కూడా మంత్రి దృష్టికి నరేష్ తీసుకొచ్చారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను ఖ‌చ్చితంగా పరిష్కరిస్తామని, సినీ రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు. స్థలం కేటాయింపు విషయాన్ని సీఎం కేసీఆర్‌తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments