Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై చేరుకున్న దీపిక - రణ్‌వీర్ దంపతులు

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (14:50 IST)
ఇటీవల మూడుముళ్ళబంధంతో ఒక్కటైన దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌లు ముంబైకు చేరుకున్నారు. వీరిద్దరి వివాహం తాజాగా ఇటలీలోని లేక్‌కోమోలో రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెల్సిందే. న‌వంబ‌ర్ 14వ తేదీన కొంక‌ణి వివాహ ప‌ద్ద‌తిలో వీరి పెళ్లి వేడుక జ‌రుగ‌గా, 15న సింధీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. త‌మ పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫోటో కూడా బ‌య‌ట‌కి రాకుండా చాలా సీక్రెట్‌గా వీరి వివాహం జ‌రిగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం దీప్‌-వీర్ దంప‌తులు ముంబై చేరుకోగా ఎయిర్ పోర్ట్‌లో నూత‌న దంప‌తుల‌కి అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ర‌ణ్‌వీర్ ఇంటి వ‌ద్ద కూడా అభిమానులు గుమికూడ‌గా వారికి దీప్‌వీర్‌లు బయటకు వచ్చి వారికి అభివంద‌నం చేశారు. 
 
నూత‌న దంప‌తులు ఇద్ద‌రు బంగారు వర్ణపు దుస్తుల్లో మెర‌వ‌డం విశేషం. ఈ నెల 21వ తేదీన బెంగళూరులో, 28వ తేదీన ముంబైలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పటిలా తమ సినీ కెరీర్‌పై దృష్టిసారించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments